పాఠశాలల్లో హిందూ పండుగల సమయంలో ఆంక్షలు విధించడం ఎందుకని విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్ పల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతి బాపులే వెనకబడిన తరగతుల బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జుబేర్ రాఖీ పండుగకు విద్యార్థులను ఇళ్లకు పంపించేందుకు నిరాకరించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనతో వాహనాల రాకల రాకపోకలు నిలిచిపోయాయి. రాఖీ పౌర్ణమికి ప్రభుత్వం సెలవు ఇవ్వనందున విద్యార్థులను పంపించలేమని ప్రిన్సిపాల్ స్పష్టం చేయడంతో తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇతర మతస్తుల పండగలకు సెలవులు ఇచ్చే ప్రభుత్వం హిందూ పండుగలకు సెలవు ఇవ్వడం లేదని విమర్శించారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ ఆప్యాయతలకు ప్రతిరూపంగా రాఖీ పండగను నిర్వహించుకోవడం హిందువుల సాంప్రదాయం.
ఈ సాంప్రదాయాన్ని హిందువులు పురాతన కాలం నుండి ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఏడాదికోసారి వచ్చే పండగను తమ పిల్లలు లేకుండా ఎలా జరుపుకుంటామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను పంపేంత వరకు కదిలేది లేదంటూ పాఠశాల ఎదురుగా జాతీయ రహదారిపై భీష్మించుకుని కూర్చున్నారు. ప్రిన్సిపాల్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ప్రిన్సిపాల్ తో మాట్లాడారు. పోలీసుల చొరవతో పిల్లలను పంపించేందుకు ప్రిన్సిపాల్ ఒప్పుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనను విరమించి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa