ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2024, 07:33 PM

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ ను, టీయూడబ్ల్యూజే( ఐజేయు) గూడూరు మండల కమిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. టియుడబ్ల్యూజే ( ఐజేయు) గూడూరు మండల మొదటి మహాసభలో, మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం విధితమే.
నూతనంగా ఎన్నికైన మండల కమిటీ ఆధ్వర్యంలో, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ను కలిసి స్వీట్ అందజేసి సన్మానించడం జరిగింది. గూడూరు ఏజెన్సీ మండల జర్నలిస్టులకు ఇంటి స్థలాలతోపాటు, డబుల్ బెడ్ రూములు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా ఎమ్మెల్యే మురళి నాయక్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో  టియుడబ్ల్యూజే (ఐజేయు) గుర్రపు యాకాంబ్రం, జిల్లా ఉపాధ్యక్షులు ముక్తవరం సత్యనారాయణ, కోరె పాపయ్య, మండల కోశాధికారి కుందూరు కరుణాకర్ రెడ్డి, కార్యవర్గ ముఖ్య నాయకులు కన్న వెంకటేశ్వర్లు, దేసు నరేష్, ఈసం సురేష్, భూక్య నరసింహ, భీమగాని యాదగిరి, గంధసిరి రవీందర్, బూర్గు నవనీత్, పానుగంటి అజయ్, అంబటి ప్రసాద్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa