గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో అనేక లోపాలు ఉన్నట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ధరణి ప్రక్షాళనకు కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, ధరణి స్థానంలో భూధార్ పోర్టల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టం అమల్లోకి వస్తుంది. గ్రామాల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు కూడా ప్రభుత్వం హక్కుపత్రాలను ఇస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ భూములకు పాస్ పుస్తకాలు జారీ చేస్తుండగా.. అదే మాదిరిగానే ఇళ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు జారీ చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల 10,894 గ్రామాల్లోని ఇళ్ల స్థలాల యజమానులకు ప్రయోజనం చేకూరుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ నిర్ణయం వల్ల భూదాన్, ఇతర వివాదాస్పద భూములను మినహాయిస్తే.. దాదాపు 8 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు దక్కవచ్చునని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్త ఆర్వోఆర్తో సాదాబైనామా దరఖాస్తులకూ కూడా పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. వాటిని కూడా పరిశీలించి హక్కు పత్రాలను జారీ చేయనున్నారు. ఈ అధికారులను ఆర్డీవోలకు కట్టబెట్టనున్నారు. భూములకు విశిష్ట సంఖ్య- భూధార్ కేటాయింపు జరిగితే.. దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. ప్రస్తుతం మండల స్థాయిలో భూ రికార్డుల నిర్వహణ జరగుతుండగా.. కొత్త ఆర్వోఆర్ చట్టంతో గ్రామస్థాయిలో భూ రికార్డుల నిర్వహణ సాధ్యం కానుంది.
1989 నుంచి 2016 వరకు సాదాబైనామా దరఖాస్తులకు మండల పరిధిలో ఎమ్మార్వోలు హక్కుపత్రాలను జారీ చేసేవారు. కొత్త చట్టం ప్రకారం ఆ అధికారాలు ఆర్డీవోలకు కట్టబెట్టనున్నారు. ఆర్వోఆర్ ముసాయిదా చట్టంలోని సెక్షన్-6లో సాదాబైనామాలకు హక్కుపత్రాల జారీ వివరాలను క్లియర్గా వెల్లడించారు. భూమి మీద 18 రకాలుగా హక్కులు కల్పించేలా కొత్త ఆర్వోఆర్ చట్టం అవకాశం కల్పిస్తోంది. సెక్షన్-5 ప్రకారం భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లో అభ్యంతరాలుంటే.. మ్యుటేషన్ను నిలిపివేసే అధికారాన్ని అధికారులకు కల్పించారు. అయితే.. మ్యుటేషన్ను నిలిపివేసే అధికారులు అందుకు తగ్గ కారణాలను లిఖతపూర్వకంగా పేర్కొనాల్సి ఉంటుంది.
ఎమ్మార్వో స్థాయిలో మ్యుటేషన్ నిలిచిపోతే.. భూమి హక్కులు గలవారు అప్పీల్కు అవకాశం ఉంటుంది. వీలునామాలు, వారసత్వ ఆస్తి పంపకాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటి బదలాయింపు అంశంలో క్షేత్రస్థాయిలో విచారణ చేశాకే.. మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కొత్త చట్టం చెబుతోంది. లేనిపక్షంలో ఆయా భూములకు మ్యుటేషన్కు అవకాశం ఉండదు. ఆర్వోఆర్ చట్టం అమల్లోకి రాగానే.. ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa