వరంగల్ జిల్లా ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలోనే పరకాల నియోజకవర్గ రివ్యూ మీటింగ్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ క్రమంలో మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. రివ్యూ మీటింగ్లో.. ముఖ్యమైన అంశాలు విశ్లేషించుకున్నామని.. పరకాలకు సంబంధించిన విషయంపై హైదరాబాద్లో మాట్లాడనున్నట్టు తెలిపారు. ఇక.. టెక్స్ టైల్ పార్క్ గురించి ప్రస్తావించిన పొంగులేటి.. ఈ విషయంలో గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయని తెలిపారు.
టెక్స్టైల్ పార్క్ వరంగల్ జిల్లా ప్రజలు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. గతంలో వరంగల్కు వచ్చిన ముఖ్యమంత్రి టెక్స్ టైల్ పార్కును ఈ దేశంలో కాదు.. ప్రపంచ దేశాలకే రోల్ మోడల్గా చేయాలని ఉందని చెప్పినట్టు గుర్తు చేశారు. దక్షిణ కొరియా పర్యటనలోనూ.. టెక్స్ టైల్ పార్క్ గురించి చాలా విషయాలు మాట్లాడినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో టెక్ టైల్ పార్కుకి పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని.. అందుకు చాలా సంస్థలు సుముఖంగా ఉన్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల పక్షపతి అని మంత్రి పొంగులేటి తెలిపారు. వైఎస్ జలయజ్ఞంలో భాగంగా మొదలుపెట్టిన కొనేమాకులను రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తద్వారా ఆ ప్రాంత ప్రజలుకు ఎంతో మేలు చేకూరనుందని వివరించారు. ఇక.. నెల రోజుల్లోనే నూతన ఆస్పత్రిలో మొదటి ఫ్లోర్ ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ప్రారంభించటమే కాకుండా.. పాత ఆస్పత్రిని కొత్త హాస్పిటల్లోకి షిఫ్ట్ చేస్తామని తెలిపారు.
అంతేకాకుండా.. మున్సిపలిటీ పరిధిలో డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్రం ఇబ్బందులుపడుతున్నాని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం 4 కోట్లతో మొక్కుబడిగా పనులు చేసిందని విమర్శించారు. పరకాలలో డ్రైనేజీ సమస్యలు లేకుండా చేస్తామని పొంగులేటి మాట ఇచ్చారు. ప్రతి ఇంటికి కొబ్బరి నీళ్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం చెప్పిందని.. మిషన్ భగీరథ భాగోతం బయటపడిందన్నారు. ప్రజలకు స్వచ్చమైన మంచి నీరు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందని.. మాటలతో కాకుండా, ధనిక రాష్ట్రం అని కాకుండా.. అభివృది, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పని చేస్తున్నామని తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన 2 లక్షల మేర రుణమాఫీని అమలు చేశామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 19 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నాయకులు కొంతమందిని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో అర్హులైన రైతులకు 12 వేల కోట్ల అందిస్తామన్నారు. మరోవైరు.. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన మాటను కూడా నెరవేర్చుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. మాటలతో కాకుండా మౌలిక వసతుల విషయంలో ఈ ప్రభుత్వం సదుపాయాలు అందిస్తుందని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa