ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీతారాం ఏచూరి మరణం ఉద్యమానికి తీరని లోటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 02:53 PM

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ లు అన్నారు. అనంతరం సీతారాం ఏచూరి చిత్రపటానికి జగద్గిరిగుట్ట సీపీఐ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల వైపు మాట్లాడుతూ, దేశంలో వామపక్ష పార్టీల ఐక్యత కోసం పాటుపడ్డారని, అనేక పోరాటాలకు నాయకత్వం వహించి గొప్ప వక్తగా, పార్లమెంటరియన్ గా సీతారం ఏచూరి పేరు తెచ్చుకున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యుడు హరనాథ్,ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్,శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి, మునిసిపల్ అధ్యక్షుడు రాములు, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు,సీపీఐ నాయకులు ఇమామ్, నగేష్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa