జగిత్యాల జిల్లా బుగ్గారంకేంద్రములో డిటోనేటర్ ల (బాంబుల) గోదాం అనుమతులు ఎక్కడి అక్కడ నిలిపి వేయాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు అయిన విడిసి కోర్ కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి సంబంధిత అధికారులను, అధికార పార్టీ నేతలను కోరారు. డిటోనేటర్ల అనుమతులు నిలిపివేయకుంటే ప్రజా చైతన్యంతో ఉద్యమాలను ఉద్రిక్తం చేస్తాం వన్యప్రాణులను రక్షించి పర్యావరణ కాలుష్యాన్ని కాపాడాలని బుగ్గార మండల ప్రజల ఆలోచన విధానం కూడా బాంబుల గోదాం వద్దని బలపరచుకున్నారు ప్రజల్లో కూడా ప్రజలకు హానికరమైన విధానం ఉంటదని ప్రజల్లో తిరుగుబాటుకై వెనుకాడని ఐక్యత ఏర్పడ్డది.బుగ్గారం మండల కేంద్రంలోని బస్టాండ్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఆయన గ్రామస్తులతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన జక్కుల లింగన్న తో పాటు మరికొందరు వ్యక్తులు ఈ బాంబుల గోదాం నిర్మాణం కోసం పరోక్షంగా కృషి చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. వెంటనే వారి - వారి ప్రయత్నాలు మానుకోవాలని ఆయన కోరారు. లేనిపక్షంలో మీరు గ్రామానికి, ప్రజలకు తీరని ద్రోహం, అన్యాయం చేసిన వారు అవుతారని ఆయన సూచించారు. జక్కుల లింగన్న అనే వ్యక్తి తన భూములను బాంబుల గోదాం నిర్మాణం కోసం విక్రయించడం వెంటనే మానుకోవాలన్నారు. మీ సొంత ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలకు హాని కలిగించే పనులు చేయడం తగదన్నారు. డిటోనేటర్ ల గోదాం కు భూములు విక్రయించడం, అనుమతుల కొరకు ప్రయత్నాలు చేయడం, పరోక్షంగా సహకరించడం జక్కుల లింగన్న కు, ఇతర వ్యక్తులకు తగదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa