ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చందానగర్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 02:56 PM

చందానగర్ లో గుర్తు  తెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైన  సంఘటన చందా నగర్ పీ యస్ పరిధిలో చోటుచేసుకున్నది. చందానగర్ యస్ ఐ సంధ్య తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం  ఉదయం చందానగర్ ప్రధాన రహదారిపై సుమారు (35)గల గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో  పడిఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.. వెంటనే పోలిస్ లు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించగా  అప్పటికే చనిపోయి ఉన్నాడు.
ఘటన స్థలిలో మృతునికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు  కనుగొనబడలేదు.  మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa