ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు ఆసరాగా సీఎం సహాయనిధి..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 02:59 PM

సీఎం సహాయనిధి పేదలకు ఆసరాగా నిలిచి ప్రాణాలను కాపాడుతోందని కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మంద శ్రీనివాస్. సినియర్ నాయకులు జర్నలిస్ట్ మూర్తి నరేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం చేర్వాపూర్ 6 వ వార్డు లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపించేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య మంత్రి సహాయ నిధితో నేడు నిరుపేదలు కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకుంటున్నారని  నిరుపేదల ఆరోగ్యం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లుప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు  . కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచిందని గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa