ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి.. ప్రమాదాలను నివారించండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 03:31 PM

 ప్రైవేటు వాహనాలలో ప్రయాణించి ప్రమాదాలను కోరి తెచ్చుకోవద్దని ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం చేయాలని హనుమకొండ డిపో మేనేజర్ బి ధరమ్ సింగ్ అన్నారు. శుక్రవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలనుసారం వరంగల్ బస్టాండ్ నుంచి అక్కంపేట అగ్రంపాడు చౌల్లపల్లి మీదుగా ఆత్మకూరు వరకు నూతన బస్ సర్వీసును డిపో మేనేజర్ ధరమ్ సింగ్, తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, డిపో పి ఆర్ ఓ రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, మాజీ జెడ్పిటిసి కక్కర్ల రాధిక రాజు గౌడ్, మాజీ సర్పంచ్ కంచె రవికుమార్  ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిపో మేనేజర్ ధరమ్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం చేయాలని  కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బొమ్మగని భాగ్య రవి గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు ధర్మేందర్, తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa