ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏచూరి మరణం దేశం లోని విద్యార్థి ,ప్రజానీకానికి తీరని లోటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 03:34 PM

పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాలికల జూనియర్ కళాశాలలో మాజీ ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ రాష్ట్ర నాయకులు ఎర్రవెల్లి ముత్యం రావు,మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీపెళ్లి రవీందర్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ల సందీప్ జిల్లెల్ల ప్రశాంత్ లు మాట్లాడుతూ పూర్వ జాతీయ అద్యక్షులు సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు, ప్రగతిశీల ఉద్యమానికి, దేశానికి తీరని లోటు 1974లో ఎస్ఎఫ్ఐ లో చేరిన తను యూనివర్శిటీ సమస్యలపై పోరాడారు.
ఎమర్జన్సీ కాలంలో విద్యార్థి హక్కులపై పోరాడుతూనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ ముందు ధైర్యంగా నిలబడి కొట్లాడారని, 1977-78 వరుసగా 3 సార్లు జే ఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు. 1984లో జాతీయ అధ్యక్షులుగా పనిచేశారని ఆ కాలంలో దేశంలో ఎస్ఎఫ్ఐ ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొని బాలమైన విద్యార్థి సంఘంగా అన్ని విశ్వవిద్యాలయాలలో విజయ బహుట ఎగురవేసిందని తెలిపారు. విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న సమయంలో అనేక ఉద్యమాలు, పోరాటాల గురించి అధ్యయనం చేస్తూనే ప్రపంచ దేశాలలో కమ్యూనిస్టు, కార్మిక ఉద్యమాలకు అండగా నిలిచారు. దేశంలో అణగారిన వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, సామాజిక తరగతుల హక్కులకై అలుపెరగని ఉద్యమాలు చేశారని, పార్లమెంటులో హక్కుల కోసం , రాజ్యాంగ రక్షణ కోసం పోరాడారని కొనియాడారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీలలో అనేక అంశాలపై సీతారాం ఏచూరితో ఉపన్యాసాలు ఆయన ఆహ్వానించి మరీ ఇప్పించేవారని, అందుకే దేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిందని అన్నారు. వారి మరణం భారతదేశలోని పీడిత తాడిత వర్గాల ప్రజలకు దిగ్బంధాన్ని గురిచేసిందని అన్నారు. ముఖ్యంగా తన చివరి దశబ్ద కాలంలో ఫాసిస్టు మతోన్మాద శక్తుల నుండి దేశ ప్రజలను చైతన్యం చేస్తూ, పార్లమెంట్లో అ ప్రజాస్వామిక విధానాలను ఎండగడుతూ, చైతన్యం వైపు నడిపించిన గొప్ప రాజకీయ యోధుడు తను మరణించడం బాధాకరమని సీతారాం ఏచూరి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజకుమార్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్రెంకల సురేష్, జోష్ణ, ఫాతిమా, ప్రవళిక, సారిక, తదితర విద్యార్థినిలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa