ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2024, 07:35 PM

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ కేర్ హాస్పిటల్ కృషి చేయడం జరుగుతుందని డాక్టర్ కృష్ణ సాయి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచితంగా ఓపి సేవలతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డయాబెటిస్తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
వ్యాధిగ్రస్తులు ఉచితంగా నిర్వహించే ఓపి సేవలతో పాటు వివిధ వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కృష్ణ సాయి సూచించారు. సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టు కుటుంబాలకు సైతం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రిలో సైతం పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు వైద్యులను అభినందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa