ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వచ్ఛత హి సేవ - 2024 అవగాహన కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 03:23 PM

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నిజాంపేట్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో స్వచ్ఛత హి సేవ - 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు తమతో పాటు ఇతరులకు రోడ్లపై చెత్త వేయకుండా ప్లాస్టిక్ కవర్లు వాడకం నిషేదించే దిశగా అవగాహనా కల్పించాలని కోరారు. తడి పొడి చెత్త వేరుచేసి, ఎప్పటికపుడ్డు పరిసర ప్రాంతాల పరిశుభ్రత, పాటించాలని సూచించారు.
మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులతో కలిసి స్వచ్ఛ ప్లేడ్జ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రఘునాథ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సుకృత రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్  విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ప్రార్ధబ్ సింగ్,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa