మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలంలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులు, టీఎస్ యుటిఎఫ్ లో భాగస్వాములు కావాలని, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి గారు అన్నారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించగల సంఘం ఏదైనా ఉన్నదంటే అది టీఎస్ యుటిఎఫ్ మాత్రమే అన్నారు. మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు, ప్రతి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారన్నారు.
ఈ సంవత్సరం జరిగిన ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్ లలో, టీఎస్ యుటిఎఫ్ సంఘం యొక్క పోరాట ప్రతిఫలమే . అలాగే ఇప్పటి ప్రభుత్వం కూడా పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలన్నారు. అలాగే పెండింగ్ లలో ఉన్న, డి ఏ లను కూడా వెంటనే ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యు టిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ధనసరి రమేష్, గూడూరు మండల అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తేజవత్ రవీందర్, కార్యదర్శులు దేవేందర్, రమేష్ లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa