వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా టౌన్ ప్లానింగ్ అధికారిగా శరభ లింగం అందించిన సేవలు మరువలేనివనిమున్సిపల్ చైర్ పర్సన్ అన్నారు. ఈరోజు చైర్ పర్సన్ గారి ఆధ్వర్యంలో టిపిఓ శరభ లింగం గారి పదవి విరమణ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ గారు శరభ లింగం గారిని, ఆయన సతీమణిని పూలమాల శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ శరభలింగం తన కెరీర్ ప్రారంభంలో వికారాబాద్ మున్సిపాలిటీలోనే పదవి బాధ్యతలు చేపట్టి చివరికి ఇదే మున్సిపాలిటీ నుంచి పదవి విరమణ పొందడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన అన్నారు. అలాగే తన శేష జీవితం కూడా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని చైర్ పర్సన్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ జాకిర్ అహ్మద్, కౌన్సిలర్ సురేష్, వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, నాయకులు రామ్ నివాస్ రాటి, రమేష్ గౌడ్, టౌన్ ప్లానింగ్ అధికారి వేణుగోపాల్, డిఈ రాకేష్ రెడ్డి, ఎన్జీవోస్ స్టేట్ ప్రెసిడెంట్ ప్రభాకర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa