ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూడూరు మండల కేంద్రం లో విసృతంగా పర్యటించి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 02:33 PM

మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలోని చంద్రుగూడెం లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు  బాధిత కుటుంబాలను, మృతి చెందిన కుటుంబ సభ్యులను, ఎండి యాకూబ్ పాషను, వారి  కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయంతోపాటుగా, 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. అదేవిధంగా బొల్లేపల్లి గ్రామంలో  కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలు బాధిత కుటుంబాలను, మృతి చెందిన  కుటుంబ సభ్యులను  మహబూబాబాద్ శాసనసభ్యులు  డాక్టర్ భూక్యా మురళి నాయక్ పరామర్శించారు. ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త చిన్న వయసు లోనే గుండెపోటుతో మృతి చెందిన, కోరెం సురేష్  చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి, వారి చిన్నారుల భవిష్యత్తుకు అండదండగా నిలుస్తామని భరోసాని ఇచ్చారు.
అలాగే చిట్టే కోమురయ్య, ఎల్లమ్మ, కుటుంబాలను పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వారి కుటుంబాలకు అన్నివేళలా అండదండగా ఉంటుందని అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్, మండల యూత్ అధ్యక్షులు, పలు గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ జడ్పిటిసిలు, మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa