తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణతో వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ ఓ స్థాయికి వెళ్లటానికి టీడీపీ కారణమని చెబుతుంటారు. రేవంత్ తొలిసారిగా ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ సీఎం అయ్యారు. అయితే రేవంత్ కాంగ్రెస్ పార్టీ సీఎం అయినా.. చంద్రబాబు, బాలకృష్ణలపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటారని సన్నిహితులు చెబుతుంటారు.
హైదరాబాద్లో ఇటీవల జరిగిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవానికి రేవంత్ హాజరయ్యారు. ఈ హాస్పిటల్ బాలకృష్ణ తల్లి పేరుతో నిర్వహిస్తుండగా.. మేనేజింగ్ ట్రస్టీ ఆయనే. ఇక నందమూరి బాలకృష్ణ తిరిగి 25 వార్షికోత్సవానికి రావాలని తనను కోరుతున్నారని.. 30వ వార్షికోత్సవానికి కూడా తానే వస్తానని సరదాగా రేవంత్ చెప్పుకొచ్చారు. ఆస్పత్రి లీజ్ వివాదాన్ని క్యాబినేట్ నిర్ణయం తీసుకుని పరిష్కరించామని చెప్పారు. భవిష్యత్తులో బసవతారకం హాస్పిటల్కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక ఇటీవల ఏపీ, తెలంగాణలో వరదలు రాగా.. బాలకృష్ణ తెలంగాణ ప్రభుత్వానికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ చెక్కును బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సీఎం రేవంత్కు అందించారు.
ఈ విషయాలు పక్కన పెడితే.. బాలకృష్ణకు రేవంత్ సర్కార్ బంపరాఫర్ ఇవ్వనున్నట్లు సమాచారం. బాలకృష్ణ సినిమా స్టూడియో నిర్మించుకోడానికి ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైనట్లు తెలిసింది. ఈరోజు సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుండగా.. ఆ సమావేశంలో ఈ అంశంపై దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యకు బహుమతిగా ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం వస్తోంది.
భూమి కేటాయింపుపై అధికారులు కార్యాచరణ మెుదలుపెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ శివారు ప్రాంతంలో బాలకృష్ణ సినీ స్టూడియోకు భూ కేటాయింపుపై రెవెన్యూ శాఖ నుంచి ఇప్పటికే సీఎస్ కు ప్రతిపాదనలు వెళ్లాయని తెలిసింది. కాగా బాలకృష్ణకు ప్రభుత్వ భూమిని కేటాయించడంపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa