ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు... అమ్మాయిలకు మాత్రమే స్పెషల్ క్లాసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 04:42 PM

హైదరాబాద్ శివారులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు దారుణానికి ఒడిగట్టారు. ప్రభుత్వ పాఠశాలలో బాలబాలికలకు చదువు చెప్పాల్సిన కీచక ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థినిలను టార్గెట్ చేసి తన కోరికలు తీర్చుకుంటున్నాడు.కేవలం అమ్మాయిలకు మాత్రమే స్పెషల్ క్లాసులు అంటూ స్కూల్ సమయం ముగిసినా అమ్మాయిలను క్లాస్ రూమ్ లోకి పిలిపించుకొని లైంగికంగా వేధిస్తున్నాడు.. దీంతో విద్యార్థినులు ఎవరికి చెప్పుకోలేక మదనపడుతూ.. మహిళా టీచర్లను ఆశ్రయించారు.. ఈ దారుణ ఘటన రాజేంద్రనగర్‌లోని బుద్వేల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చోటుచేసుకుంది..జడ్పీహెచ్ఎస్ స్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. స్పెషల్ క్లాసులు అంటూ రాత్రి 8 గంటల వరకు అమ్మాయిలను ఇంటికి పంపించకుండా వేధింపులకు గురి చేశాడు. క్లాస్ రూమ్ లో అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు ఇష్టం వచ్చినట్లు అమ్మాయిలపై చేయి వేస్తూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో పలువురు విద్యార్థినులు విషయం ఎవరికీ చెప్పుకోవాలో తెలియక తమ మహిళా టీచర్లకు తెలియజేశారు. మహిళా టీచర్లు విద్యార్థులను తీసుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్లారు. దీంతో ప్రిన్సిపాల్ ను కూడా ఆయన అసభ్య పదజాలంతో దూషించాడు.


దీంతో ఏం చేయాలో దిక్కతోచని విద్యార్థులు జరిగిన విషయం మొత్తాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. పెద్ద ఎత్తున స్కూల్ వద్దకు చేరుకున్న విద్యార్థినుల కుటుంబసభ్యులు ఫిజిక్స్ టీచర్ వేణుగోపాల్ ను సస్పెండ్ చేయాలని కోరారు. అంతేకాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు వేణుగోపాలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు లైంగిక ఆరోపణలు రావటంతో విద్యాశాఖ అధికారులు వేణుగోపాల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa