ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొల్లపల్లిలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2024, 10:03 AM

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కట్ట మహేష్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశ నిర్దేశం చేశారు.ప్రియతమ ప్రధాని నరేంద్ర మోది సుపరిపాలన ఫలాలను గ్రామ గ్రామానికి అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్లాలన్నారు.అంతులేని నిబద్ధత అసమానమైన పోరాట పటిమవున్న  నాయకులు కార్యకర్తలున్న గొల్లపల్లి మండలంలో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు.
ఈ నెల ఇరువై తేది నుండి వచ్చే నెల ఇరువై తేది వరకు మండలంలోని 27 గ్రామాల్లో 246 వార్డులలో పర్యటించి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గండ్ర ప్రసాద్ రావు,గొల్లపల్లి రాంరెడ్డి,అనుమాండ్ల రాఘవ రెడ్డి,బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ కొక్కు లక్ష్మణ్,మండల ఉపాధ్యక్షులు భీమా మహేష్,గోలి రమేష్,సంకటి గంగారజం,అనసురి చరణ్,మండల అధ్యక్షులు లక్కాకుల వెంకటేష్,గాజుల శ్రీధర్,వనపర్తి రాజేందర్,ఎనగందుల రమేష్,బత్తుల శ్రీనివాస్,బండారు నరేష్,దాసరి మల్లయ్య,బండారు శ్రీనివాస్,పట్టణ అధ్యక్షులు సంగెం కళ్యాణ్,గడ్డి సాయి,సిలివేరి తిరుపతి,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa