రైతులు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని వరి పంటను పండించి మార్కెట్కు తీసుకువచ్చి నెల రోజులు అవుచున్నను నర్సంపేట వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు సెంటర్లో అనేక కుంటి సాకులు చెబుతూ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయనందున ఈరోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ గేటు వద్ద రైతులతో ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ ధర్నాలో సిపిఐ ఎంఎల్ వరంగల్ జిల్లా నాయకులు కామ్రేడ్ మోడెం మల్లేశం హాజరై మాట్లాడుతూ.. వరి రైతులు ఈ సంవత్సరం సీజన్ ప్రారంభం నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కొని పంటను పండించి ధాన్యాన్ని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లోని ప్రభుత్వ కొనుగోలు సెంటర్కు తీసుకువచ్చి నెలరోజులు అవుతున్నను, తిండి నిద్రాహారాలు మాని చలిలో అరుకాలం కష్టపడి ధాన్యం వద్ద రాత్రి వేళల్లో ఉన్నప్పటికీ నేటి వరకు ఒక్క రైతు వద్ద నుండి కూడా కొనుగోలు సెంటర్ వారు వ్యవసాయ అధికారులు ధాన్యం కొనుగోలు చేయలేదు. దీనికి తోడు దాన్యంలో తాలు డస్టు ఉందంటూ బస్తాకు మూడు కేజీలు అదనముగా కాంటపేట్టుటకు రైతులు అనుమతిస్తేనే మేము ధాన్యం కొనుగోలు చేస్తామని సెంటర్ నిర్వాహకులు చెప్పడం, అంటే ఎంతటి అక్రమాలు జరుగుతున్నాయో అర్థమవుతుంది.
ఇంత బహిరంగంగా జరుగుతున్న ను ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా ఉండటం విడ్డూరంగా ఉంది. వ్యవసాయ మార్కెట్లో గత నెల రోజులుగా రైతులు తమ ధాన్యాన్ని ఆరబోసి నిరంతరం సంచరిస్తున్న పందుల నుండి రక్షణ తీసుకొని శ్రమ పడటం జరుగుతుంది. చివరికి ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుందామనుకున్న రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. దీనితో ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు తమ ధాన్యాన్ని రైతులు అమ్ముకునే పరిస్థితిని కల్పిస్తున్నారు. కావున ఇప్పటికైనాను అధికారులు స్పందించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కటింగ్స్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అక్కడికి వచ్చిన నర్సంపేట తహసిల్దార్ గారిని నిలదీయడం, డిమాండ్ చేయటం జరిగినది. స్పందించిన తహసిల్దార్ గారు సెంటర్ నిర్వాహకులను వ్యవసాయ శాఖ అధికారులను పిలిచి మాట్లాడి వెంటనే రైతులకు టోకెన్లు ఇప్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రైతులు ఎడ్ల ప్రతాపరెడ్డి వెంకన్న రమేష్ పూలక్కా పద్మ అరుణ విజయ రాజన్న రవి రాములు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa