ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రూ.5.4 కోట్ల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2024, 07:43 PM

అమెరికాలో ఓ తెలుగు యువకుడి మరణానికి కారణమైన అపార్ట్‌మెంట్‌కు అక్కడి స్థానిక న్యాయస్థానం భారీగా ఫైన్ విధిచించింది. మృతుడి కుటుంబానికి రూ.5.40 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చింది. అపార్ట్‌మెంట్‌లోని ఈత కొలనులో యువకుడు మృతి చెందగా.. సరైన భద్రతా చర్యలు తీసుకోనందున అపార్ట్‌మెంట్‌ నిర్వహకులకు భారీగా ఫైన్ విధిస్తూ ఆ మెుత్తాన్ని పరిహారంగా బాధిత కుటుంబానికి అందజేయాలని ఆదేశించింది.


వివరాల్లోకి వెలితే.. హైదరాబాద్ శామీర్‌పేటకు చెందిన కొల్లి మణిదీప్ ఉన్నత విద్య కోసం గతేడాది అమెరికా వెళ్లాడు. అక్కడి కాన్సాస్ రాష్ట్రంలో స్నేహితులతో కలిసి ఉండేవాడు. అతను నివాసముంటున్న అపార్ట్‌మెంట్ ఈత కొలనులో ప్రమాదవశాత్తు మునిగి మణిదీప్ గతేడాది మరణించాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఈత రాక అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మణిదీప్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చిన అంత్యక్రియలు పూర్తి చేశారు.


అయితే అమెరికాలో ప్రముఖ న్యాయవాది, హైదరాబాద్ మూలాలున్న అబ్దుల్ క్యూ ఆరిఫ్, అక్కడి సామాజికవేత్త విక్రంసాగర్ కలిసి మణిదీప్ మృతి ఘటనపై స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అపార్ట్‌మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే మణిదీప్ మృతి చెందినట్లు కోర్టులో పిటిషన్ వేశారు. స్మిమ్మింగ్‌పూల్ లోతు తెలియజేసే సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవటంతో అందులోకి దిగిన మణిదీప్ మునిగి చనిపోయాడని వాదించారు. అతడి మృతికి అపార్ట్‌మెంట్ నిర్వహకులే కారరమణని అన్నారు. వీరి వాదనలో అక్కడి న్యాయస్థానం ఏకీభవించింది. బాధిత కుటుంబానికి రూ.5.40 కోట్ల పరిహారం చెల్లించాలని అపార్ట్‌మెంట్ నిర్వాహకులను కోర్టు ఆదేశించింది.


హైదరాబాద్ టీహబ్లో శనివారం (నవంబర్ 30) నిర్వహించిన కార్యక్రమంలో ఈ పరిహారానికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా.. అబ్దుల్ క్యూ ఆరిఫ్, విక్రం సాగర్ మణిదీప్ తల్లిదండ్రులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆరిఫ్, విక్రం సాగర్లను అభినందించారు. వివిధ దేశాల్లో ఉంటున్న భారత విద్యార్థుల హక్కులు, రక్షణకు ఇలాంటి చర్యలు ఎంతో అవసరమని మంత్రి కొనియాడు. కాగా, అమెరికాలో ఓ తెలుగు విద్యార్థికి అనుకూలంగా అక్కడి కోర్టు తీర్పు ఇవ్వడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారని అమెరికాలోని తెలుగు సంఘాలు వెల్లడించాయి. పరిహారంతో బాధిత కుటుంబానికి కొంత మేరైనా ఊరట లభిస్తుందని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa