ప్రజల ప్రాణాలకు ఏమైతే ఏంటి.. మాకైతే కాసులు కావాలి. ఇలా ఉంది కొందరు వ్యాపారుల పరిస్థితి. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు వ్యాపారులు రోజూ ఉపయోగించే వంటింటి ఉత్పత్తులను కల్తీ చేస్తున్నారు. నూనెలు, కారం, పసులు, అల్లెం వెల్లుల్లి ఇలా ప్రతిదాన్ని కల్తీ చేస్తున్నారు. ప్రమాదకర రసాయనాలతో వాటిని తయారు చేసి బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి మార్కెట్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా.. రసాయనాలతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న స్థావరంపై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు.
చెన్నాపురం దేవేందర్నగర్లోని ఓ ఇంట్లో అక్రమంగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మహ్మద్ హతుల్లా (25) అనే వ్యక్తి ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్నారు. ప్రమాదకర రసాయనాలతో అల్లంవెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో గుర్తించారు. సుమారు 1000 కేజీల వరకు సిద్ధం చేసిన అల్లం వెల్లుల్లి పేస్టును, రసాయనాలను సీజ్ చేశారు. 50 కేజీల డబ్బాలు 6, అరకిలో ఉండే 183 డబ్బాలు, 332 కిలో డబ్బాలు, 5 కేజీల డబ్బాలు 35లను సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి హోల్సేల్ మార్కెట్లలో వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లిలోనూ ఇటీవల భారీ ఎత్తున కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును అధికారులు పట్టుకున్నారు. బోయిన్పల్లిలోని రాజరాజేశ్వరి నగర్లోని ఓ ఫ్యాక్టరీలో 'సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్' పేరుతో రసాయనాలు ఉపయోగించి కల్తీ అల్లం పేస్టు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 1500 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది. మరో నాలుగున్నర లక్షలు విలువ చేసే మెటీరియల్ సైతం అధికారులు సీజ్ చేశారు. ఈ కల్తీ వ్యవహారంలో పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా రసాయానాలతో కల్తీ చేసే ఈ అల్లం వెల్లుల్లి పేస్టును నగరంలోని హోటల్స్కు సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించారు. తక్కువ ధరకే వస్తుండటంతో హోటల్ యజమానులు ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు వైపు మెుగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa