సిపిఎం పార్టీ పెద్దపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కల్లేపల్లి అశోక్, సిపెళ్లి రవీందర్ లు మాట్లాడుతూ. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక జిల్లా కేంద్రానికి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు జిల్లా కేంద్రానికి అనేక పనుల నిమిత్తం అనగా జిల్లా కేంద్రంలో ప్రధాన ప్రభుత్వాసుపత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం రైల్వే స్టేషన్ మరియు వ్యాపారాల కొరకు జిల్లా కేంద్రానికి ప్రజలు వస్తూ వెళ్తున్నారు.ఈ క్రమంలో వాహనాల రద్దీ పెరిగి 2021 నుండి 2024 వరకు సుమారుగా పెద్దకాల్వల గ్రామంనుండి మంథని బ్రిడ్జి వరకు 70 రోడ్డు ప్రమాదలు జరిగినవి.దీంట్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.40 మంది అంగవైకల్యం పాలయ్యారని అన్నారు.దీనితో బాధిత కుటుంబాలు పడుతున్నారు.
కావున జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మించి రోడ్డుప్రమాదాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కి భారీ వాహనాలు రావడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు బైపాస్ రోడ్ నిర్మిస్తే భారీ వాహనాలు జిల్లా కేంద్రంలోనికి రాకుండా ఉంటాయి.దీని వలన కొంతవరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు.వెంటనే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బై పాస్ రోడ్డు మంజూరు చేయించి నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మోదుంపల్లి శ్రావణ్, జిల్లాల ప్రశాంత్, ఎండి కాజా, కల్లేపల్లి సూరజ్,నితిన్,ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa