హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమించిన వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో సొంత తమ్ముడే ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. నాగమణి హయత్నగర్ పీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుండగా.. స్వగ్రామం రాయపోల్ నుంచి సోమవారం (డిసెంబర్ 2) ఉదయం స్కూటీపై డ్యూటీకీ వెళ్తుండగా.. మార్గమధ్యలోనే ఆమెను కారుతో ఢీకొట్టి, కొడవలితో నరికి ఆమె తమ్ముడు పరమేష్ కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయాడు.
కాగా, నాగమణి హత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాగమణి తల్లిదండ్రులు పన్నేండేళ్ల క్రితమే చనిపోయారు. దీంతో నాగమణితో పాటు ఆమె అక్క, తమ్ముడు పరమేష్ను పెద్దనాన్న పెంచాడు. వీరికి మూడెకరాల భూమి ఉండగా.. ముగ్గురికి సమానంగా పంచారు. అనంతరం నాగమణికి, ఆమె అక్కకు పదేళ్ల క్రితమే వివాహం జరిపించారు. అయితే భార్యభర్తల మధ్య విభేదాల కారణంగా నాగమణి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత గ్రామానికే చెందిన శ్రీకాంత్ అనే యువకుడిని ప్రేమించింది.
ఈ విషయం తెలిసిన తమ్ముడు పరమేష్ నాగమణిని దూరం పెట్టాడు. దీంతో ప్రేమించిన శ్రీకాంతే ఆమెను హైదరాబాద్లోని హాస్టల్లో ఉంచి చదివించాడు. ఈ క్రమంలో 2020లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. శ్రీకాంత్ను ప్రేమించంతో ఆమె పేరుతో ఉన్న ఎకరా భూమిని తనపేరుతో రాయాలని పరమేష్ పలుమార్లు పెద్దమనుషుల పంచాయితీ పెట్టించాడు. దీంతో నాగమణి ఆ భూమిని తిరిగి తమ్ముడి పేరుతో రిజిస్ట్రేషన్ చేసింది. అనంతరం గత నెల 10న యాదగిరి గుట్టలో శ్రీకాంత్ను ప్రేమ వివాహం చేసుకుంది.
వీరి పెళ్లి విషయాన్ని జీర్ణించుకోలేని పరమేష్.. వాళ్లను చంపేస్తానని బెదిరించాడు. దీంతో నాగమణి-శ్రీకాంత్ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల ఎదుటే ఏనాటికైనా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు తన ఆస్తిలో వాటా అడనని బాండ్ రాసివ్వాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు నాగమణి ఒప్పుకోలేదు. దానికి తోడు ఇటీవల పరమేష్కు వివాహం కుదరగా.. అక్క విషయం తెలిసి అమ్మాయి తరపు వాళ్లు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.
వీటన్నింటిని పరమేష్ మనసులో పెట్టుకున్నాడు. కులాంతర వివాహం చేసుకోవంటతో పాటుగా.. ఎకరా పొలం వివాదం ఉండటం.. ఈ రెండు ప్రధాన కారణాలతో పాటు తన పెళ్లి చెడిపోవటానికి అక్కే కారణమని కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మాటు వేసిన పరమేష్ ఆమెను కారుతో గుద్ది, కొడవలితో నరికి కిరాతకంగా హత్య చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa