తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సరిగ్గా ఉదయం 7.27 నిమిషాల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది.అత్యధికంగా ములుగులో రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. రెండు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఎప్పుడైనా అక్కడక్కడా భూప్రకంపనలు వస్తుంటాయని, కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి చాలా చోట్ల భూమి కదలడం భయానికి గురిచేసిందని ప్రజలు చెబుతున్నారు. అటు గడిచిన 20 ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి.హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఈ రోజు ఉదయం భూమి కంపించింది. ఎన్ఎస్సీ రిపోర్టు ప్రకారం.. కిస్మత్పుర, గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి పక్కన మీనాక్షి బాంబుస్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 67, బంజారాహిల్స్ ఆడియో విజార్డ్, అమీర్పేట, మధురానగర్ ఎస్బీఐ, ఎస్సార్ నగర్ గ్రాండ్ అయోధ్య హోటల్, అత్తాపూర్ ఏఎం కిరాణా స్టోర్, చిక్కడపల్లి పీపుల్ పార్క్ పక్కన, బెల్ దగ్గర నక్షత్ర క్యాటరింగ్, గౌలిదొడ్డి గురుకుల పాఠశాల వద్ద భూమి కంపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa