ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనుగోలు కేంద్రాలలో 300నుండి 700గ్రాముల అదనపు తూకాలను వెంటనే ఆపాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 03:01 PM

మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంతో పాటు బొద్దుగొండ, కొల్లాపురం, మచ్చర్ల లో ఐకెపి, పిఎసిఎస్, జి సి సి  ఆధ్వర్యంలో నడుస్తున్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అఖిలభారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్ ) జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్, వారి పార్టీ నాయకులతో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యం  కొనుగోలు చేస్తున్న కొనుగోలు కేంద్రాలలో  ప్రభుత్వం చెప్పిన లెక్కల కంటే అదనంగా, 300 గ్రాముల నుండి 700  గ్రాములు ఎక్కువ కాంట పెట్టడాన్ని వెంటనే ఆపాలి. కొనుగోలు కేంద్రాల వద్ద పెట్టిన బ్యానర్లపై ఎన్ని కేజీలు కాంట వెయ్యాలి. అనేది నిర్దిష్టంగా రాయాలి. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. తార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలి.
ధాన్యం ఆరబెట్టడానికి, ధాన్యం ఆరపోసుకోవడానికి సరిపడ స్థలం లను ఎంచుకొని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. కాంటాలు అయిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలి. లారీలను అందుబాటులో ఉంచాలి. సన్నధాన్యానికే కాకుండా, దొడ్డు రకం ధాన్యాన్ని కూడా 500 రూపాయల బోనస్ ను ఇవ్వాలి. ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి, బోనస్ డబ్బులు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఇడంపాక శ్రీశైలం, అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ మండల ప్రధాన కార్యదర్శి గజ్జి లింగన్న,  నాయకులు అడ్డూరి వెంకన్న, కోట్టెం వజ్జయ్య, కాడబోయిన నరసయ్య, రామనాథం, యాకయ్య, కాడబోయిన వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa