ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీల రాజ్యాధికారమే శ్రీకాంత్ చారి కి నివాళి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 03:03 PM

మంగళవారం పెద్దపల్లి ఆర్యవైశ్య భవన్ లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జిల్లా ఐక్య సంగం అధ్యక్షుడు భీముజు సురేందర్ నాయకత్వంలో శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ఈ వర్ధంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ తెలంగాణలో శ్రీకాంతచారి బలిదానం తర్వాతనే ఉద్యమం ఉదృతమై నిప్పు కనికే వలె తెలంగాణ అంతట రగిలిందని అన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే తమ జాతి ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆత్మ బలిదానానికి శ్రీకాంత్ చారి ఒడిగట్టాడని తెలిపారు శ్రీకాంతాచారి అమారత్వానికి నిజమైన నివాళి బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేసిన రోజే సిద్ధిస్తుందని తెలిపారు 1200 మంది అమరులలో తొలి అమరుడైన శ్రీకాంత్ చారి ఆశయ సాధనలో బడుగు బలహీన వర్గాల ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు పోలీస్ కిష్టయ్య శ్రీకాంతాచారి అమరత్వ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల ప్రజలు ఐక్య ఉద్యమాల ద్వారా రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం సాధించాలని కోరారు.
శ్రీకాంత్ చారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా చేపట్టాలని జిల్లా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంగం అధ్యక్షులు భీముజు సురేందర్ కోరారు విశ్వబ్రాహ్మణ వర్గం వారు స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక సంఖ్యలో పాల్గొని విజయం సాధించాలని కోరారు తెలంగాణ జిల్లాలో ఏదైనా జిల్లాకు శ్రీకాంత్ చారి పేరు పెట్టాలని బి మోజు సురేందర్ ఆశాభవం వ్యక్తం చేశారు.ఈ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు చెల్లోజు కవిత ,మేడారం రాజ్యలక్ష్మి, నూతి లక్ష్మి, పెద్దపల్లి పట్టణ సంఘ అధ్యక్షులు నాగుల మల్యాల ప్రసాద్, రామగిరి చంద్రమౌళి, లక్కాపురం నరహరి, పెద్దపల్లి మండల అధ్యక్షులు రామోజీ నరసింహ చారి, మాణిక్ అంజయ్య ,బీమోజు ,రాజేందర్ ,సంపత్ రవీందర్, సదానందం, రంగు రమేష్ కోటయ్య, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa