పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని రైతులు నిర్వాహకులపై మండిపడ్డ ఘటన కోదాడకు కూతలవేటు దూరంలో ఉన్న తమ్మరబండ పాలెంలో చోటుచేసుకుంది. రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఇటీవల కాలంలోనే సూర్యాపేట జిల్లా కలెక్టర్ తనిఖీలు నిర్వహించిన సెంటర్లోనే అవకతవకలు జరిగాయని రైతులు పేర్కొన్నారు, కాగ సంబంధిత అధికారులు పక్కనే ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించక పోకపోవడంతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా ధాన్యం కొనుగోలు నిర్వాహకులు బీహార్ హమాలీలతో 41కేజీల150 గ్రాముల ధాన్యాన్ని కాంటాలు వేస్తున్నారని రైతులు తెలిపారు. బస్తా బరువు 650 గ్రాములు ఉంటే అదనంగా 600 గ్రాముల ధాన్యాన్ని వేస్తున్నారని రైతులు మండిపడ్డారు. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత పడితే అంత హమాలీలతో ఇష్టానుసారంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కాంటాలు వేపిస్తున్నారని రైతులు ఆగ్రహ వ్యక్తం చేశారు.
బయట దళారులు మోసం చేస్తున్నారని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాలను రైతులు తీసుకువస్తుంటే ఇక్కడ దానికంటే ఎక్కువగా భారీ మోసాలు జరుగుతున్నాయని రైతులు నిర్వాహకులపై ధ్వజమెత్తారు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని రైతులను మోసాలు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్ ను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa