భారత దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సంవత్సర కాలంలో 53 మంది విద్యార్థులు మరణించడం జరిగింది అని ఈ రోజు జిల్లా తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో కంచర్ల రవి గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండి పడ్డారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇన్ని సంఘటనలు అయినా, ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదు అని ఆయన అన్నారు.
భారత రాష్ట్ర సమితి నాయకులు గురుకులాల బాట పేరుతో మేం హాస్టల్ లో సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తే మమ్మల్ని సంఘ విద్రోహ శక్తులుగా అడ్డుకొని అరెస్టు చేయడం దారుణం అని అంతా బాగుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 53 మంది విద్యార్థులు మరణించారు. 1500 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా ఆని, అక్రమ అరెస్టు లతో, కేసులతో, లాఠీలతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరు, ఉపాధ్యాయులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది అని, పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను గేట్ల వద్ద నిలపెడుతుంది. కాంగ్రెస్కు వణుకు మొదలైందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో దాదాపు ఏడాదిగా విద్యాశాఖకు మంత్రి లేరని, సంక్షేమ శాఖకు మంత్రి లేదరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గురుకులాలు ప్రమాదపుటంచులో ఉన్నాయన్నారు. నాణ్యమైన భోజనం కోసం విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారని విమర్శించారు.
గురుకులాల పిల్లలు హాస్టల్ లో కంటే ఆసుపత్రి లోనే ఎక్కువ ఉంటున్నారు అని. మమ్మల్ని అడ్డుకోవడం మీద పెట్టిన శ్రద్ధ గురుకులాల్లో నాణ్యమైన ఆహారం పెట్టడం పైన, సౌకర్యాలు కల్పించడం పైన పెడితే గురుకులాలు బాగుపడతాయి అని విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అని ఆయన ప్రశ్నించారు. నిన్నటి రోజున మరో బాలిక ప్రభుత్వపాఠశాల జయశంకర్ భూపాలపల్లి గురుకుల హాస్టల్ లో అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అని.
అంతే కాకుండా నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనలో మరో విద్యార్దిని పరిస్థితి విషమంగా ఉందని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. ఇప్పటి కి అయిన ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి విద్యాశాఖ మంత్రి నీ నియమించి.జరిగిన సంఘటనలకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని. వారిని విధుల నుండి తొలగించాలని. గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో అధికారులతో సమీక్ష నిర్వహించాలని రివ్యూ చేయాలని బిఆర్ఎస్ పార్టీ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో గురుకుల బాటా చేపడితే ఇలా అక్రమ అరెస్టులకు భయపడలేదు అని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుందని. విద్యార్థులకు కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని. ఇలాంటి సంఘటనలు ఇంకో ఒక్కటి కూడా జరుగకుండా జాగ్రత్త వహించాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్. నాయకులు ముగ్దం అనిల్ . ముడం సాయి.సామల శ్రీకాంత్ దేవరాజు. అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa