ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగరవాసులకు బిగ్ అలర్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 09, 2024, 04:04 PM

తెలంగాణ  ప్రభుత్వ ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా ఇవాళ సెక్రటేరియట్‌ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది.ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు  పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు  విధిస్తున్నట్లుగా ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేసింది. ఈ మేరకు మధ్యహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటలకు సచివాలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులు ఆల్టర్‌నేట్ రూట్లలో తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. తెలంగాణ విగ్రహావిష్కరణ కార్యక్రామానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, విపక్ష ఎమ్మెల్యేలు, అధికారులు హాజరు కానుండటంతో సెక్రటేరియట్  మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa