ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లుల చెల్లింపు, విద్యార్థుల సమస్యల పైన అదనపు కలెక్టర్ కి వినతి...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 02:30 PM

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాసరి వేణూ కి  విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లుల చెల్లింపు,విద్యార్థుల సమస్యల పైన వినతి పత్రం ఇచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్ కృష్ణయ్య  ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల ముట్టడి లో భాగముగా పలు డిమాండ్ల పైన పెండింగ్ లో ఉన్న విద్యార్థుల రెండు ఏళ్ల  ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు 4000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, తక్షణమే అన్ని బీసీ ,ఎస్సీ,మైనారిటీ  గురుకులాలకు సొంత భవనాలని నిర్మించాలని, కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి 20,000 స్కాలర్షిప్ మంజూరు చేయాలని, విదేశీ విద్యకి అన్ని దేశాలకు 20 లక్షల స్టైఫండ్  వెళ్లే వారికి అమలు చేయాలని, ఐఐటి ఐఐఎం కోర్సులు చదివే వారికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని, ఇంటర్మీడియట్ విద్యార్థుల స్కాలర్షిప్ 1800 నుండి 15 వేలకు పెంచాలని, బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్ ని 200 కోట్లకు పెంచాలని, ప్రభుత్వమే అన్ని ఉద్యోగ పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు తెరవాలని  డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పొన్నం ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి సరోజ సత్యనారాయణ, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి బొద్దుల అరుణ, జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు నోమురి శ్రీధర్,రామగుండం నియోజకవర్గ కన్వీనర్ వింజమూరి సురేష్, పలు మండలాల అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, బీసీ సంఘాల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa