ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానవ హక్కుల దినోత్సవం న పాఠశాలలో పండ్లు పంపిణీ ....

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 02:28 PM

నెక్కొండ మండల కేంద్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ బాలికల పాఠశాలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ చిల్డ్రన్స్ ఎన్పవర్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని ఎన్ హెచ్ ఆర్ సి డబ్ల్యూ ఈవో చైర్మన్ మహమ్మద్ మైనుద్దీన్ గారి ఆదేశాల మేరకు 200 మంది విద్యార్థులకు ఎన్ హెచ్ ఆర్ సి డబ్ల్యూ ఈ ఓ నర్సంపేట నియోజకవర్గం అధ్యక్షులు బొమ్మెర యాదాద్రి, నర్సంపేట నియోజకవర్గం ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ నర్మెట యాదగిరి ,గార్ల ఆధ్వర్యంలో పండ్లను పంపించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై మానవ హక్కుల రవాణాపై విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేస్తూ వారి యొక్క హక్కులను వినియోగించుకునే విధంగా పలు సూచనలు సలహాలు అందించారు బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించే విధంగా చూడాలని అన్నారు విద్యార్థులు ఉన్నత చదువులు చదివి పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రక్యతలు తీసుకువచ్చి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ సి, ఈసీ నెంబర్ కడుదురి హైమ, ఎన్ హెచ్ ఆర్ సి వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి మొగసాని శంకర్, తడుగుల రాజు పాఠశాల పాఠశాల ఉపాధ్యాయురాలు ఏటీపీ ప్రతిభ, భవాని, నాగమణి, రజిత, సుమలత, సంధ్య, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa