ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో శుక్రవారం రోజున ఓ సైకో కలకలం సృష్టించాడు. చిన్న పిల్లలను వెంటపడుతూ చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. ఆ ఆగంతకుడి చేతిలో కత్తి కూడా ఉండటంతో భక్తులు, చిన్న పిల్లలు మరింత భయందోళనకు గురయ్యారు. కత్తితో చిన్న పిల్లలపై దాడి చేయడానికి యత్నించడంతో.. కొంతమంది భక్తులు ధైర్యం చేసి అతన్ని పట్టుకున్నారు. అనంతరం తిరుమల ట్రాఫిక్ పోలీసుల చేతికి అప్పగించారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులు ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. అనంతరం తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. మతి స్థిమితం లేని వ్యక్తి పశ్చిమ బెంగాల్కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.
మరోవైపు తిరుమలలో గత మార్చి నెలలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు తిరుమలలో హల్ చల్ చేశాడు. ఓ మహిళతో గొడవకు కూడా దిగాడు. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ యువకుణ్ని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇటీవలే తిరుమలలో డ్రోన్ సంచారం కలకలం రేపింది. మూడంచెల భద్రత వ్యవస్థ ఉన్న తిరుమలలో వాటి అన్నింటినీ దాటుకుని ఓ వ్యక్తి తిరుమలలో డ్రోన్ ఎగరేయడం సంచలనం రేపింది. దీంతో భక్తులు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారు డ్రోన్ ఎగరేసినవారిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం విచారణలో వీరు ఇద్దరు ప్రవాస భారతీయులని తేలింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన వీరు.. అలిపిరి చెక్ పోస్టు వద్ద భద్రతా సిబ్బంది కళ్లు గప్పి డ్రోన్ను తిరుమలకు తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. శిలాతోరణం వద్ద డ్రోన్ ఎగరేయగా.. భక్తుల సమాచారంతో టీటీడీ సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వీరిని పోలీసులకు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa