దొంగల్లో రకరకాల దొంగలు ఉంటారు. వారు చోరీ చేసే విధానం, వస్తువులు ఇలా విభిన్నంగా ఉంటాయి. కొందరు ఖరీదైన వస్తువులనే టార్గెట్ చేస్తారు. మరే వస్తువును ముట్టుకోరు. మరికొందరు చిన్న చిన్న వస్తువులనే ఎత్తుకెళ్తారే తప్ప.. డబ్బు, బంగారం ఇతర వస్తువుల జోలికెళ్లరు. ఇంకొందరి దొంగల తీరు ఫన్నీ ఉంటుంది. దొంగలందూ ఈ దొంగలు వేరయా అన్న చందంగా దొంగతనాలకు పాల్పడుతుంటారు. అటువంటి దొంగలే తాజాగా పోలీసులకు పట్టుబడ్డారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఉప్పల్లోని భరత్నగర్లో ఇండ్ల ముందు వదిలేస్తున్న చెప్పులు, షూలు, స్లిప్పర్స్ మాయం అవుతున్నాయి. ఒక ఇంట్లో కాదు.. అందరి ఇండ్లలోనూ చెప్పులు మాయం అవుతున్నాయి. దీంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చెప్పులు ఎటు వెళ్తున్నాయా..? అని ఆలోచనలో పడ్డారు. ఎవరో ఇళ్లలోకి చొరబడి బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్తున్నట్లు గ్రహించారు. దొంగను ఎలాగైనా పట్టుకోవాలని కాలనీ వాసులంతా డిసైడ్ అయ్యారు.
రెండ్రోజుల క్రితం ఓ వ్యక్తి అనుమానస్పదంగా కాలనీలో తిరుగుతుండటాన్న స్థానికులు గమనించారు. అనుమానంతో అతడిని వెంబడించారు. వాసవీ కాలనీలోని అనుమానాస్పద వ్యక్తి ఇంట్లోకి వెళ్లారు. అక్కడ కనిపించింది చూసి షాక్కు గురయ్యారు. ఒకటి కాదు. రెండు కాదు.. కొన్ని వందల చెప్పుల జతలు అతడి ఇంట్లో కనిపించాయి. ఇంట్లోని సంచుల్లో, అరల్లో, ఇంటి పైకప్పుపై ఇలా ఎక్కడ చూసినా చెప్పులు, షూలే దర్శనమిచ్చాయి. తళారి మల్లేశ్, అతని భార్య రేణుక కాలనీలో చెప్పుల దొంగతనానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. రామాంతపూర్, వాసవీనగర్, భరత్ నగర్లలో చెప్పులు చోరీ చేసి సెకండ్ హ్యాండ్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
సనత్ నగర్ సండే మార్కెట్లో ఈ చెప్పులను కుప్పలుగా పోసి రూ.100, రూ.200 చొప్పున విక్రయిస్తున్నట్లు కాలనీ వాసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. ఇదేం దరిద్రంరా నాయనా అని చెప్పులను ఎవరైనా దొంగతనం చేస్తారా? అని చర్చించుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa