తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నెక్కొండ మండల అధ్యక్షులు భూక్య నరేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ గ్రామ పంచాయతి ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చాగంటి వెంకటయ్య మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు గత నాలుగు నుండి ఆరు నెలల వరకు రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని జిల్లాలో పది నెలల వరకు వేతనాలు లేకుండా పస్తులుండి పనులు చేస్తున్నారని అప్పుల పాలవుతున్నారని ఈ ప్రభుత్వంకు వేతనాల బకాయిపై రాష్ట్ర వ్యాప్తంగా అనేకమార్లు.
విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రాష్ట్రంలో ఇప్పటివరకు మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల పంచాయతీ కార్మికులు ట్రాక్టర్ నడుపుతూ కరెంటు పనులు చేస్తూ 186 మంది చనిపోయారని వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం గాని ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం గానీ ఎటువంటి నోచుకోకుండా దిక్కు లేకుండా చనిపోయిన కుటుంబాలు వీధిన పడ్డాయని పంచాయితీ ఉద్యోగ కార్మికులు గ్రామాలలో పారిశుధ్యం మంచినీటి సరఫరా విద్యుత్ సరఫరా డెంగ్యూ మలేరియా కరోనా వంటి విపత్కర పరిస్థితిలో కూడా ప్రతినిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేస్తున్నారని 40 సంవత్సరాలుగా వివిధ పంచాయతీలలో పనిచేస్తున్న పర్మినెంట్ చేసిన ప్రభుత్వమే లేదని పాలకులు వస్తున్నారు పోతున్నారు తప్ప మా సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వ పాలకులు పంచాయితీ సిబ్బంది పట్ల వివక్షత చూపుతున్నారని మేము గ్రామాలలో ప్రజల ఆరోగ్యాల సౌకర్యాల కోసం పనిచేస్తున్నామని గత ప్రభుత్వం తీసుకొచ్చిన మల్టీపర్పస్ వర్కర్ విధానం జీవో నెంబర్ 51 ద్వారా పడుతున్న ఇబ్బందులపై గత అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు మాట్లాడిన ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని గత ప్రభుత్వ విధానాలని ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని ప్రజలలో మార్పు కావాలని కోరుతున్నది కానీ మా పంచాయతీ కార్మికుల సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని గ్రామపంచాయతీ కార్మికులకు కట్టు బానిసలుగా చేసే మెడకు ఉరితాడుగా ఉన్న మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయమని 51 జీవో సవరించాలని రాష్ట్రములో బకాయిపడిన వేతనాలను చెల్లిస్తూ ప్రత్యేక గ్రాంట్ ను కేటాయించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కారోబార్ బిల్ కలెక్టర్ లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షల వరకు కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలని పీఎఫ్ ఈఎస్ఐ తదిత సౌకర్యాలు కల్పించాలని పర్మినెంట్ చేయాలని కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 17న చలో హైదరాబాద్ కార్యక్రమం ఇందిరా పార్కులో నిర్వహిస్తున్నామని రాష్ట్రంలోని గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు కారోబార్ బిల్ కలెక్టర్ స్లీపర్ పంప్ ఆపరేటర్ ఎలక్ట్రిషన్ అటెండర్ తదితరులందరూ హాజరై విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాం కార్యక్రమంలో ఈదునూరి సాయిలు మేర్గు మదర్. సింగారపు యాకయ్య బస్కే శ్రీను కనకం కృష్ణ సింగం ఉపేంద్ర సింగం హైమా జన్ను సూరమ్మ ఎస్ కర్ణాకర్ ఎస్ స్వామి ఈ హారీష్ జే సబిత నాగమ్మ పున్నం నాగేష్ ప్రవీణ్ . తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa