కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ లో శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ శంకర్ తెలిపారు. నిందితులు నేరేడుచర్ల కు చెందిన మెలుసు మధు, ఇంజమూరి యశ్వంత్ ల నుండి 900 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు గోవర్ధన్, రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa