ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహాసభల్లో జాన్ వెస్లీని కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాల వెల్లడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 08:48 PM

సీపీఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ నియమితులయ్యారు. ఇప్పటివరకు తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. సంగారెడ్డిలో జరిగిన సీపీఎం రాష్ట్ర మహాసభల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.జాన్ వెస్లీ వనపర్తి జిల్లాలోని అమరచింతకు చెందినవారు. ఆయన గతంలో డీవైఎఫ్ఐ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa