ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హక్కుల సాధనకై గొంతు ఎత్తుదాం...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 03:20 PM

వేల గొంతులు కార్యక్రమం విజయవంతానికి ప్రతి మాదిగ జర్నలిస్టు హైదరాబాద్ కు తరలిరావాలని అనంతగిరి మండలం ఖానాపురం ఎంఆర్పిఎస్ నాయకులు పేర్కొన్నారు. గత కొన్ని ఏండ్లుగా  ఏబిసిడి వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు రావడం పట్ల తమ హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం రాత్రి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  వర్గీకరణ  అమలు కొరకు జరుగుతున్న ఈ సమరంలో  పాల్గొనేందుకు హైదరాబాదుకు ఫిబ్రవరి 7ను తరలి వెళ్తున్నామని తెలిపారు. మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఎస్సీలు సైతం ఈ కార్యక్రమానికి కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సోమపంగు నాగేశ్వరరావు ,బండ్ల శ్రీను, సోమపంగు మోహన్ రావు,   సోమపంగు జమీస్, సోమపొంగు చిన్న వీరయ్య, బండ్ల భాస్కర్, సోమపంగు సహదేవ, సోమపంగు రవి, ఇజ్రాయిల్, సుధాకర్, శ్రవణ్, సుందర్ రావు, సందీప్, రమేష్, మోసయ్య, చార్లెస్, మధు ,బాబు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa