భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి పట్టణ మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ల సందీప్,జిల్లాల ప్రశాంత్ హాజరై మహాసభలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 1970లో కేరళలోని త్రివేండ్రం లో పుట్టి ఇప్పటికి విద్యార్థుల శ్రేయస్సు కోసం భావి భారత పౌరుల భవిష్యత్తు కోసం దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న విద్యా వ్యతిరేక విధానాలపై ఉచిత విద్య అందరికీ సమానంగా అందే విధంగా నిరంతరం అలుపెరుగని పోరాటాలను ఉద్యమాలను నిర్వహిస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ అన్నారు.
అలాగే పెద్దపల్లి పట్టణంలోని సంక్షేమ హాస్టల్ సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి ఫలితంగా ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ సాధించుకోవడం జరిగిందని అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ లో మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచడం జరిగిందని అన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ డే మనసిపెంట్ విడుదల చేయాలని అనేక పోరాటాలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం వల్ల దేశ సమగ్రత సమైక్యత దెబ్బతీసే విధంగా ఉందన్నారు ఇప్పటికైనా విద్యా వ్యతిరేక విధానాలు వదిలేసి దేశ విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వాల అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధాలపై విద్యార్థులు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అనంతరం పెద్దపల్లి ఎస్ఎఫ్ఐ పట్టణ నూతన కమిటీని 15 మందితో ఎన్నిక చేశారు. పట్టణ అధ్యక్షులు గా ఆర్నకొండ ఆదిత్య ,కార్యదర్శి గా మామిడిపల్లి అరవింద్, ఉపాధ్యక్షులుగా బన్నీ,నరేష్,మణిరత్నం,సహాయ కార్యదర్శులుగా అభిరామ్,జ్ఞానేశ్వర్,రాజు,కమిటీ సభ్యులు మహేందర్ ,దిలీప్,మధు,లను ఎన్నుకోవడం జరిగింది.రాజుకుమార్,రామ్ చరణ్,నితిన్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa