ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:24 PM

జాతీయ రహదారి భద్రత  వారోత్సవాలు భాగంగా  రాజన్న సిరిసిల్ల జిల్లా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా  ఆటో డ్రైవర్ లు  లైసెన్స్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అన్ని పత్రాలు కలిగి ఉండాలని మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు.
ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా  పాటిస్తూ  కెపాసిటీ వరకు ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకోవాలని ప్రతి ఒక్కరు డ్రెస్ కోడ్ పాటించాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. ఎక్కువ ప్రమాదాలు నివారించడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వెహికల్ ఇన్స్పెక్టర్ పృథ్వి కానిస్టేబుల్ .ప్రశాంత్. వేణు ఆటో డ్రైవర్ లు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa