ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఆత్మహత్యలన్నిటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన : హరీష్ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 12:39 PM

 కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం విధ్వంసమైందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో ఫ్లాట్లు అమ్ముడు పోలేదని, మేడ్చల్ జిల్లాలో బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయమని ఎక్స్ వేదికగా విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు ప్రాణాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన, అనాలోచిత అసమర్థ విధానాలే కారణమని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa