ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామీణ ప్రాంతాల అభివృద్దె కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 06:54 PM

గ్రామాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధికి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషి చేస్తున్నారని ఖానాపురం గ్రామ శాఖ అధ్యక్షులు కనగాల వీరయ్య అన్నారు. శాసనసభ్యులు పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో ఎన్ ఆర్ జిఎస్ నిధుల నుండి 5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం కొరకు ఒకటవ వార్డులో బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందినప్పుడే ప్రజల జీవనశైలి మారుతుందన్నారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ కోటేశ్వరరావు, గింజుపల్లి రమేష్, గాదే వెంకన్న, గింజుపల్లి రఘు, ఉయ్యాల వీరయ్య గౌడ్, గాదె రామారావు, జర్రిపోతుల నాగేశ్వరరావు, బండ్ల శ్రీను, సోమపంగు మోహన్ రావు తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa