ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమగ్రాభివృద్ధికి కృషి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 07:06 PM

మండలంలోని తాటిపల్లి లో  ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డా‌.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌటాల నుండి తుమ్మిడిహెట్టి వరకు బీటీ రెన్యువల్ కోసం రూ.8 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందని, టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కనికి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, భూ కేటాయింపులు జరిగిన తర్వాత పనులు ప్రారంభిస్తామని, తద్వారా మారమూల ప్రాంత రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు పశువుల డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని తెలిపారు.
బెల్లంపల్లి - గడ్చిరోలి జాతీయ రహదారి లో భాగంగా కౌటాల మండలం నుంచి వెళ్లే జాతీయ రహదారి వలన ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, అటవీ సమస్యలు పరిష్కరించిన మీదట జాతీయ రహదారి పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గ చిరకాల వాంఛయైన ప్రాణహిత ప్రాజెక్టు సాధన కోసం రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలవడం జరిగిందని, కొత్త డిపిఆర్ తయారుచేసి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగితే బాగుంటుందని తెలియ జేశామని అన్నారు. రాబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని తెలియజేశారు. 
వచ్చే నెలలో కౌటాలలో 132/33 KV సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని ఆహ్వానించానని, ఈ సబ్ స్టేషన్ ప్రారంభమైతే సిర్పూర్ నియోజకవర్గం లో వోల్టేజ్ సమస్యలు తీరుతాయని తెలియజేశారు.
కౌటాల మండలంలోని మిర్చి రైతులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారికి కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థ కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని తెలియజేశారు. తాటిపల్లి కుర్తా శివరాత్రి జాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, అక్కడున్న కరెంటు సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా  గ్రామస్తులు పలు సమస్యలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది.
ఈ మీడియా సమావేశంలో భాజపా జిల్లా కార్యదర్శి బండి రాజేందర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఎల్ములే మల్లయ్య, మండల అధ్యక్షులు కుంచాల విజయ్, మాజీ ఎంపీటీసీ దుర్గం మోతిరాం, మాజీ సర్పంచ్ యశ్వంత్, తిరుపతి గౌడ్, శ్రీనివాస్,బండు పటేల్, తిరుపతి మేకల, నర్సింగ్ రావు, దత్తు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa