ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్గొండ జిల్లాలో నకిలీ విలేకర్ల ముఠా ఒకటి పోలీసులను టార్గెట్ చేసింది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 02, 2025, 02:50 PM

నల్గొండ జిల్లాలో నకిలీ విలేకర్ల ముఠా ఒకటి పోలీసులను టార్గెట్ చేసింది. అక్రమాలు బయటపెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. వీరి డిమాండ్లకు ఓ సీఐ తలొగ్గడం గమనార్హం. రూ.5 లక్షలు ఇవ్వాలని సదరు ముఠా డిమాండ్ చేయగా.. వారి ఆగడాలు తట్టుకోలేక సీఐ తన మిత్రుడి ద్వారా రూ 1.10 లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆ ముఠా బెదిరింపులు ఆగలేదు. తాము డిమాండ్ చేసిన సొమ్ములో మిగతా రూ.4 లక్షలు ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించింది. ఈ ముఠా ఆగడాలు భరించలేక సదరు సీఐ తన శాఖలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు దర్యాఫ్తు చేపట్టి ఆ ముఠాలోని ఒక నకిలీ విలేకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa