ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడంగల్ నియోజకవర్గంలో రోడ్డెక్కిన విద్యార్థులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2025, 11:01 AM

 ఉడకని అన్నం, నీళ్లలాంటి సాంబారు, ఒక్కపూట మాత్రమే అన్నం వడ్డింపు.. ఇదీ సీఎం రేవంత్ రెడ్డి  సొంత నియోజకవర్గంలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చెన్నారం పాఠశాలలో ఉడకని అన్నం నీళ్లలాంటి సాంబారు పెడుతున్నారని, అన్నం ఒక్కపూట మాత్రమే వడ్డిస్తున్నారని విద్యార్థులు  ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే గుడ్డు, అరటిపండు నెలలో ఒక్కసారి మాత్రమే పెడుతున్నారని విద్యార్థులు తల్లితండ్రులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై పిల్లల తల్లిదండ్రులు పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో భోజనం పెట్టకపోవడంతో ఆగ్రహించి పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు, వంట నిర్వాహకులను మార్చాలని ఎంఈఓ శంకర్ నాయక్‌ను డిమాండ్ చేశారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa