ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం ఆరు గ్యారంటీ అమలు చేసి స్థానిక ఎన్నికలలోకి వెళ్లాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 05:38 PM

ముస్తాబాద్ మండల కేంద్రంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సౌల్ల క్రాంతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపి అనంతరం తాసిల్దార్ సురేష్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సౌల క్రాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల  హామీలతో అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న ఇచ్చిన హామీలను  నెరవేర్చడంలో  ప్రభుత్వం విఫలమైందని ఇచ్చిన హామీలను అమలు చేసి స్థానిక ఎన్నికల్లోకి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం  ఓట్ల రాజకీయం కోసం పథకాలు  పైలెట్ ప్రాజెక్టు కింద ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డ్ లు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని మండలంలో అన్ని గ్రామాల ప్రజల అందరికీ పథకాలను అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి  సంతోష్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శిలు సౌల్ల క్రాంతి. బాద నరేష్. కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్. ఓబిసి మండల అధ్యక్షులు చిగురు వెంకన్న. బిజెపి సీనియర్ నాయకులు చిట్టినేని శ్రీనివాసరావు. జిల్లెల్ల మల్లేశం.కోళ్ల కృష్ణ. కాసోడి రమేష్. కస్తూరి కార్తిక రెడ్డి. బాల్ రెడ్డి. తిరుపతి. కనకయ్య వెంకటేష్. మహేష్ గణేష్. బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa