ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభోపీతంగా శ్రీ మల్లికార్జున స్వామి విగ్ర ప్రతిష్ట కళ్యాణ మహోత్సవాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 05:30 PM

ముస్తాబాద్ మండలం ఆవునూర్ .తుర్కపల్లి. రామ లక్ష్మణపల్లె గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలు గౌడ సంఘ సభ్యులు వైభవంగా నిర్వహిస్తున్నారు. మల్లికార్జున స్వామి విగ్రహాలను గ్రామంలో ఊరేగింపుగా చేపట్టి గణపతి పుణ్యా వచనం నవగ్రహ అష్ట దిక్కల్పన మంటప రాధన  కలిశా స్థాపన మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించి శుక్రవారం నాడు దేవత విగ్రహల ప్రతిష్ట దేవతామూర్తులకు అభిషేకం అలంకరణ మంత్రపుష్పం ప్రత్యేక పూజలు శనివారం రోజున గంగ స్నానం తేప్పోత్సవం స్వామి వారి ఎదుర్కొల్లు సోమవారం.
మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇట్టి కార్యక్రమానికి మండల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని గౌడ సంఘ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ మల్లికార్జున ఆలయ దేవాలయం నిర్మాణం విగ్రహాలకు దాతల సహకారంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు సహకరించిన దాతలకు గౌడ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa