ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయ శాఖ ద్వారా పత్తి పంటలో సమగ్ర యాజమాన్య ఉద్యాన పంటల సాగు అవగాహన సదస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 02:22 PM

ఈరోజు నెక్కొండ మండలంలోని పత్తిపాక గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన పంటల సాగు అవగాహన కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి కే అనురాధ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంగీతలక్ష్మిలు మాట్లాడుతూ పత్తి పంటను అధిక సాంద్రత విధానంలో పండించే విధానం రకాలు అధిక దిగుబడి సాధించు పద్ధతులు కూరగాయలు పండ్ల తోటలు ఆయిల్ ఫామ్ సాగు విధానము ఎరువుల యాజమాన్యం గురించి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంగీతలక్ష్మి రైతులకు వివరించినారు.
పత్తి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి వీరన్న మాట్లాడుతూ పత్తి మరియు మొక్కజొన్న పంటలలో అధిక యూరియా వాడడం వలన వచ్చే నష్టాల గురించి రైతులకు వివరించినారు మొక్కజొన్న లో వచ్చే వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళు నివారణకు ఉపయోగించే ట్రైకోడెర్మా విరిడి తయారీ విధానము పంటలలో వాడకం గురించి బీసీ ల్యాబ్ ఏ డి ఏ మాధవిలు రైతులకు అవగాహన కార్యక్రమంలో వివరించినారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కే అనురాధ ఉద్యానవన శాఖ అధికారి సంగీత లక్ష్మి పత్తి ప్రధాన శాస్త్రవేత్త జి వీరన్న బీసీ ల్యాబ్ ఏ డి ఏ మాధవి మండల వ్యవసాయ అధికారి ఏ నాగరాజు ఏఈవోలు రాజేష్ వసంత రాజీవ్ అరుణ్ మరియు పత్తిపాక గ్రామ రైతులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa