తెలంగాణలో రైతులకు ఇప్పపటివరకు కేవలం ఎకరం ఉన్న రైతులకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయగా.. ఇక రేపటి నుంచి రెండు ఎకరాలున్న అన్నదాతల అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు జయ చేయనున్నట్టు తెలిపింది. గతంలో మాదిరిగానే.. ముందు ఎకరా ఉన్న రైతులకు ఆ తర్వాత రెండు, మూడు ఎకరాలు ఇలా విడతల వారిగా రైతు భరోసా సాయం అందించనుంది ప్రభుత్వం. ఈ మేరకు.. రేపటి నుంచి రెండు ఎకరాలున్న రైతులకు ఎకరాకు రూ.6 వేల సాయాన్ని అందించనున్నట్టు తెలుస్తోంది.
అయితే.. ఇప్పటివరకు మెుత్తం 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తొలి విడతలో 563 గ్రామాల్లోనే నిధులు విడుదల చేయగా.. తాజాగా రెండో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా ఎకరం వరకు సాగులో ఉన్న భూముల ఎకరాకు రూ.6 వేల చొప్పున నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1.55 లక్షల మందికి, సిద్దిపేట జిల్లాలో 1.20 లక్షలు , మెదక్ జిల్లాలో 1.15 లక్షలు , సంగారెడ్డి జిల్లాలో 1.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పేర్కొన్నారు.
రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద జనవరి 27 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు మొత్తంగా 21,45,330 మందికి రూ.1,126 కోట్లు జమ చేసినట్లు రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 05న ఒక్కరోజే ఎకరం వరకు సాగు చేస్తున్న 17.03 లక్షల రైతుల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున నిధులు జమ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. రైతు భరోసా అనేది ఆన్గోయింగ్ పథకం కాబట్టి ఈసీ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. దీంతో.. రైతులకు భరోసా సాయం అందటంతో ఎలాంటి అడ్డంకి ఉండదని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa