ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధ్యాయుల సమస్యలపై గొంతు ఎత్తి గర్జించిన పార్టీ బీజేపీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 09:16 PM

నిరుద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై గొంతెత్తి గర్జించిన పార్టీ బీజేపీ పార్టీ అని గ్రూప్1 అభ్యర్థులకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలనీ కొట్లాడిన పార్టీ బీజేపీ పార్టీ అని బోయిన్పల్లి ప్రవీణ్ రావు అన్నారు. గురువారం రోజున కోహెడ మండలం తీగలకుంటపల్లి చింతల తోటలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కోహెడ మండల సన్నాహక సమావేశం  మండల అధ్యక్షుడు జాలిగం రమేష్ అధ్యక్షతన జరిగింది.ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ ఎమ్మెల్సీ ఎన్నికల హుస్నాబాద్ అసెంబ్లీ ప్రభారీ బోయినిపల్లి ప్రవీణ్ రావు  హాజరై మాట్లాడుతూ పట్టభద్రుల ప్రతి సమస్యలపై ప్రభుత్వంపై సమరశంఖం పూరించి అండగా నిలిచిన బీజేపీ పార్టీని పట్టభద్రులు ఉపాధ్యాయులు ఆదారించి బీజేపీ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులైన అంజిరెడ్డి - కొమురయ్య ను మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ పార్టీ శ్రేణులు ప్రతి ఓటర్ ను కలిసి ఓటు అభ్యర్థించే విధంగా సమాయత్తం చేస్తూ దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, పార్టీ శ్రేణులు ఖమ్మం వేంకటేశం, పిల్లి నర్సయ్య, మ్యాకాల రజినీకాంత్ రెడ్డి, ద్యాగల సురేందర్, తూటి బాపురెడ్డి, గుగ్గిళ్ల శ్రీనివాస్,బొమ్మగాని శివకుమార్, కొండబత్తిని సతీష్, కంది సత్యనారాయణ రెడ్డి, సామల గిరిధర్, బాణోత్ సురేష్ నాయక్, అన్నాడి లక్ష్మారెడ్డి, బొమ్మడవేని రాజు, ఎర్రవెల్లి హరిదాస్ తదితరులున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa