ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 04:31 PM

నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో ఈశాన్య రాష్ట్రాల, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు మాట్లాడుతూ అధికార పార్టీ నుండి ఎమ్మెల్సీ కి మూడు స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. తెలంగాణ శాసన మండలి లో ఉపాద్యాయుల విషయంలో మాట్లాడాల్సిన శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్ లో ఉండటం వల్ల ఏ ఒక్కరు సమస్య మీద మాట్లాడటం గత 10 ఏండ్లలో జరుగలేదు అన్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిక కిషన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలలో బీజేపీ అభ్యర్థులు సరోత్తమ్ రెడ్డి, మల్క కొమురయ్య, అంజిరెడ్డిలు పోటీలో ఉన్నారని..వారిని ఉపాధ్యాయులు, మేధావులు, పట్టభద్రులు గెలిపించాలని కోరారు. ఈ మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు.గతంలో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీలంటే శాసన మండలిలో ప్రభుత్వాన్ని చర్చల్లో చీల్చిచెండేవారని..ప్రస్తుతం పాలక పార్టీలకు సలామ్ లు కొట్టేవారు వస్తున్నారన్నారు. దీంతో ఆయా వర్గాల ప్రజల పరిష్కారం సాధ్యపడటం లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa